అటవీ శాఖలో అక్రమ డిప్యుటేషన్లు
ముగ్గురు ఉద్యోగులు భూపాలపల్లిలో రిపోర్ట్.. పెద్దపల్లిలో విధులు
ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతర్.. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 21(నమస్తే తెలంగా ణ):అటవీ శాఖలో అక్రమ డిప్యుటేషన్ల బాగోతం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జోన్ల వారీగా, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను కేటాయించేందుకు 317 జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం ఏ జిల్లాకు కేటాయించిన వారు ఆ జిల్లాలోనే విధులు నిర్వర్తించాలి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ముగ్గురు అటవీ శాఖ ఉద్యోగులను కేటాయించగా, వారు ఇక్కడే వేతనాలు పొందుతూ పెద్దపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై ఆ శాఖ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందడంతో రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
కొత్త జోనల్ విధానంలో భాగంగా రాష్ట్ర సర్కారు తీసు కొచ్చిన జీవో నంబర్ 317 ప్రకారం జోన్ల వారీగా ఆయా జిల్లాలకు ఉద్యోగులను కేటా యించింది. ఇందులో ఏ ఒక్క ఉద్యోగికి మినహాయింపు ఉండబోదని ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు స్తూ జిల్లాలోని అటవీశాఖలో వింత పోకడలు చోటుచేసుకున్నట్లు సమాచారం. గతంలో జిల్లా అటవీ శాఖ లో పనిచేస్తున్న ముగ్గురు బీట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు పెద్దపల్లి జిల్లాలో డిప్యుటేషన్పై విధులను నిర్వర్తిస్తూ వేతనా లు మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి పొందు తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేప ట్టిన ఉద్యోగుల విభజనలో ఆ ముగ్గురు ఉద్యోగులు తిరిగి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ శాఖకు కేటాయించారు.
రిపోర్ట్ చేశారు.. డిప్యుటేషన్పై వెళ్లారు..
మహముత్తారం రేంజ్ పరిధిలోని పెగడపల్లి, కనుకు నూ రులో పనిచేస్తున్న ఇద్దరు బీట్ ఆఫీసర్లు, మల్హర్రావు మండ లం కొయ్యూరు రేంజ్లో పనిచేస్తున్న ఒకరు ఉద్యోగుల విభజనలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించగా, జిల్లాలోని అటవీ శాఖలో రిపోర్ట్ చేసిన మ రుక్షణమే తిరిగి పెద్దపల్లికి డిప్యుటేషన్పై వెళ్లి అక్కడు విధు లు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగులు కొందరిని జిల్లాకు కేటాయించగా వారు తమ కుటుంబాలు పెద్దపల్లిలో ఉన్నాయని, తమకు అక్కడే డిప్యు టేషన్ ఇవ్వాలనే డిమాండ్ రావడంతో ఈ తతంగం వెలు గులోకి వచ్చినట్లు సమాచారం.ఈ వ్యవహారంపై అటవీ శాఖ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెల్లడంతో వారు అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..
ముగ్గురు అటవీశాఖ ఉద్యోగులకు పెద్దపల్లికి డిప్యుటేషన్ ఇవ్వడం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరికీ డిప్యుటేషన్ ఇవ్వలే..
అటవీ శాఖకు 56 మంది జిల్లా కేడర్ ఉద్యోగులు వ చ్చారు. వారందరూ జిల్లాలో రిపోర్ట్ చేసి, ఇక్కడే విధులు నిర్వర్తించాలి. నాకు తెలిసి ఎవరికీ డిప్యుటేషన్ ఇవ్వలే దు. ఒక వేళ ఎవరైనా వెళ్తే వారు విధులకు గైర్హాజరుగానే పరిగణిస్తాం. ముగ్గురు ఉద్యోగుల విషయంపై పూర్తిస్థా యిలో విచారణ చే స్తా. అలాంటివి ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటా.