కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కైటెక్స్ ఇండస్ట్రీ
వచ్చే ఆగస్టు నాటికి 800 కంటెయినర్లలో మిషనరీల రాక
కంపెనీ ప్రతినిధుల సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, జనవరి 19 : మంత్రి కేటీఆర్ కృషి తోనే రాష్ర్టానికి పరిశ్రమలు వస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాక తీయ మెగా టైక్స్టైల్ పార్కును బుధవారం కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మనోజ్ కుమార్, హెచ్ఎస్ సోది (వీపీ, బిజినెస్ ఆపరేషన్స్), రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధి కారి డాక్టర్ శాంత తౌటం సందర్శించారు. టీఎస్ ఐఐసీ ద్వారా ప్రభుత్వం ఆ కంపెనీకి కేటాయించి న 201 ఎకరాల భూమిని పరిశీలించారు. అనం తరం వారు పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డితో హనుమకొండలోని ఆయన నివాసంలో సమా వేశమయ్యారు. ఈ సంద ర్భంగా టెక్స్టైల్ పార్కు లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల గురించి కైటెక్స్ కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే చర్చించా రు. అనంతరం ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ టెక్స్టై ల్ పార్కులో మంచి పేరున్న కైటెక్స్ గార్మెం ట్స్ కంపెనీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఎంతో శుభసూచకం అన్నారు. దేశవిదేశాల్లో ఉన్న కంపె నీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేం దుకు వస్తున్నాయంటే మంత్రి కేటీఆర్ కఠోర శ్రమ, కృషి ఎంతో ఉంద న్నారు. ఇందుకు మంత్రి కేటీఆర్కు ఆయన కృతజ్ఞ తలు తెలిపారు. వచ్చే జూన్, ఆగస్టు నెల వరకు 800 కంటెయినర్లలో కంపెనీ నిర్మాణానికి సంబంధించిన మిషనరీ రా నున్నట్లు ఆయన తెలిపారు. కైటెక్స్ కంపె నీలో మెకానికల్, ఎలక్ట్రిక ల్, సివిల్ ఇంజినీర్, ఐటీఐ విద్యా ర్హతలు ఉన్నవారికి టెక్నికల్, అకౌంట్స్ విభా గాల్లో ఉద్యోగాలు లభిస్తాయని వివరించా రు. పరిశ్రమల ఏర్పాటు తర్వాత 9000 మంది మహిళలు, 2,000 మంది పురుషులకు సైతం ఉపాధి దొరుకుతుందన్నారు. వీరందరికీ 15 రోజులు కంపెనీ ప్రతినిధులు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణ కాలంలో ఉద్యోగులకు కంపెనీ ఉచితంగా భోజన వసతి కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొ న్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో జిల్లాలో పండించే పత్తికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని వివ రించారు. కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం చేసు కుని పత్తిని నేరుగా రవాణా చేసే వెసులుబా టు ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్తో ముందుకెళ్తున్నారని ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.