వీరభద్రుడి నామస్మరణతో మార్మోగిన కొత్తకొండ
నిప్పుకణికలపై నడిచిన భక్తులు
కనుల పండువగా పల్లకీలో స్వామి శోభాయాత్ర
భీమదేవరపల్లి, జనవరి 18: భక్తులు శరభ.. శరభ.. అంటూ నిప్పుకణికలపై నడుస్తూ చేసిన వీరభద్రుడి నామస్మరణతో కొత్తకొండ మార్మో గింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేకువజామున ప్రభలు, మంగళ వాయిద్యాల మధ్య అగ్నిగుండాల కార్యక్రమం జరిగింది. వేకువజామునే జంగమ పూజారులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కూష్మాండా లను ఛేదనం చేశారు. కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు నిప్పుకణికలపై నడిచి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ వేడుకను తిలకిం చేందుకు ప్రజలు బారులు తీరారు. భక్తులకు ఆల య ఛైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో ఉడు తల వెంకన్న, ధర్మకర్తలు ఎల్తూరి ప్రభాకర్, నో ముల రాజు, పెద్దబోయిన హరికృష్ణ, భూక్య తులస్య, కాల్వ సునీత, కిరణ్, మఠం శ్రీశైలం, సదుపాయాలు కల్పిం చారు.
వైభవంగా శోభాయాత్ర ..
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ ళవారం రాత్రి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో శోభాయాత్ర నిర్వ హించారు. ఈనెల 10 వతేదీన అట్టహాసంగా ప్రా రంభమైన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్స వాలు మంగళవారం రాత్రి జరిగిన స్వామివారి శోభాయాత్రతో ముగిశాయి.
పారిశుధ్య కార్మికులకు సన్మానం..
జాతరలో అహర్నిశలు పనిచేసిన పారిశుధ్య కార్మికులను ప్రజాప్రతినిధులు శాలువాలు కప్పి సన్మానించారు. ఆలయంలో పారిశుధ్య కార్మికులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీ టీసీ వంగ రవి, సర్పంచ్ దూడల ప్రమీల, ఎంపీ టీసీ యాటపోలు రాజమణి, ఆలయ మాజీ చైర్మ న్ మార్పాటి మహేందర్రెడ్డి, ఉపసర్పంచ్ సిద్ద మల్ల క్రిష్ణ, అర్చకులు తాటికొండ వీరభద్ర య్య, రాంబాబు, సదానందం,రాజయ్య, వినయ్ శర్మ, శ్రీకాంత్, రమేశ్, సిబ్బంది హంసారెడ్డి, మ ల్లారె డ్డి, రాజయ్య, జగన్, రాజేందర్ పాల్గొన్నారు. అగ్ని గుండాల్లో ఎలాంటి ఇబ్బందులు వాటిల్ల కుండా ములుకనూరు ఎస్సై సురేశ్ పోలీసు బందో బస్తు నిర్వహించారు.