దుగ్గొండి, జనవరి 17 : గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నదని ఎంపీపీ కే కోమలాభద్రయ్య పేర్కొన్నారు. సోమవారం దుగ్గొండి మండలంలోని నాచినపలిలో రూ.5 లక్షల నిధులతో మంజూరైన సీసీ నార్మా ణ రోడ్డు పనులను ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పల్లె ప్రగతి పనులను వందవాతం పూర్తి చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు. అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధు లు మంజూరు చేయించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి, ఎమ్మెల్సీ కోటాలో రూ.5 లక్షలు కేటాయించిన ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఎంపీపీతో పాటు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచినసపల్లి సర్పంచ్ పీ మమతారాజు, ఎంపీటీసీ నగరబోయిన మమతామోహన్, బండి జగన్నాథం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్ రావు, ఉప సర్పంచ్ జంగరాజిరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బొమ్మినేని శ్రీనివాస్రెడ్డి, నల్ల శ్యామ్సుందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రఘుపతి, ధర్మారెడ్డి, మామిండ్ల వేణు, పీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనుల ప్రారంభం ..
చెన్నారావుపేట: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సహకారంతో నెక్కొండ మండలంలోని చెరువుముందు తండాలో రూ.5 లక్షల నిధులతో సోమవారం ఎంపీపీ జాటోత్ రమేశ్నాయక్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మండలంలో సీసీ రోడ్లకు రూ.95 లక్షల నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే పెద్దికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, మండల నాయకులు గాదె భద్రయ్య, బక్కి కుమారస్వామి, సర్పంచ్ బాలు, పీఏసీఎస్ డైరెక్టర్ చార్ల మోహన్, సూరిపల్లి గ్రామ నాయకులు చార్ల సుధీర్రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.