ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు
పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
భూపాలపల్లి, రూరల్ 14 : సంస్కృతి సంప్రదాయలకు నెలవు సంక్రాంతి పండుగ అని జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కట కం జనార్దన్ పటేల్ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ 11వ వార్డు అధ్యక్షుడు దుం డ్ర కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం 11వ వా ర్డు వేశాలపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముత్యాల ము గ్గులు కళలలకు నిలయాలని, ముగ్గులు మహిళల్లో ఉండే ప్రతిభను వెలికి తీస్తాయన్నారు. సంక్రాంతి పండుగ రోజున మహిళందరూ కలిసి ముత్యాల ము గ్గుల పోటీల్లో పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముగ్గుల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
వీజేతలు వీరే..
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వారు మొదటి బ హుమతి మసికే అక్షయ రూ. 2016, రెండో బహుమతి మేకల అన్నపూర్ణ రూ.1016, మూడో బహుమతి ఇప్పకాయల వరలక్ష్మి రూ.516 అందుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బానోత్ రజిత జుమ్ములాల్, అర్భన్ ఉపాధ్యక్షుడు మోతే రాజు, నాయకులు జాగరి అజయ్ యాదవ్, పీ ప్రసాద్, యాదవ్, రవీందర్, ఎం తిరుపతి, సురేశ్, యూత్ అధ్యక్షుడు కే రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల అందజేత..
ములుగు రూరల్: ములుగు మండలంలోని కాసిందేవిపేటలో యువ శక్తి యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ అహ్మద్పాష హాజరై మహిళలు, యువతలు వేసిన ముగ్గులను పరిశీలించి, విజేతలుగా నిలిచిన ఇనుముల సో ని, ఎం మౌనికకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చాంద్పాష, యూత్ సభ్యులు ప్రదీప్, భరత్, నితిన్, సంపత్, మదార్, వినిత్, మధు, దేవేందర్ పాల్గొన్నారు.
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల అందజేత
ములుగు మండలంలోని కాసిందేవిపేట గ్రామంలో యువ శక్తి యూత్ ఆధ్వర్యంలో సంక్రాం తి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పో టీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ అహ్మద్పాష హాజరై మహిళలు, యువతకులు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలుగా నిలిచిన ఇనుముల సోని, మ హరాజు మౌనికలకు జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చాంద్పాష, యూత్ సభ్యులు ప్రదీప్, భరత్, నితిన్, సంపత్, మదార్, అప్రొజ్, వినిత్, మధు, దేవేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామాలయంలో..
కన్నాయిగూడెం: మండలంలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే ప్రతి ఇంటి ముందు రంగు రంగులతో ముగ్గులు వేశారు. మహిళలు గోదావరిలో పున్యస్నానాలు ఆచరించి, అక్కడే ప్రత్యేక పూజలు చేశారు. గూర్రేవులలోని రామాలయం కమిటీ వారు భోగి సందర్భంగా గుడి ఆవరణంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారి బహుమతులు ప్రదానం చేశారు.