ములుగుటౌన్, జనవరి 12 : నవశకానికి స్వామి వివేకానందుడు నాంది పలికారని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ కృష్ణ అదిత్య అన్నారు. నేషనల్ యూత్ డే సందర్భంగా కలెక్టరేట్ సంక్షేమ భవన్లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి వెంకటరమణాచారి, జీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, సోషల్ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో..
ములుగు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమ్ మహ్మద్, డీఈవో కార్యాలయంలో పాణిని వివేకానందుడి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యాలయ కో ఆర్డినేటర్లు సాంబయ్య, రమాదేవి, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, విక్రమ్రాజ్, రవీందర్, రమేశ్, కుమార్, చిరంజీవి, భరత్ తదితరులు పాల్గొన్నారు.
అక్షయవర్ధిని గోశాలలో..
జిల్లా కేంద్రంలోని అక్షయ వర్ధిని గోశాల ఆవరణలో వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోశాల ఆవరణ లో 25 మొక్కలు నాటారు. కార్యక్రమంలో ట్రస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదం దేవేందర్, కోశాధికారి సూర్యదేవర విశ్వనాథ్, సిరికొండ బలరాం, నగరపు రమేశ్, ఇమ్మ డి రాకేశ్ యాదవ్, గుగ్గిళ్ల సృజన్, రవిరెడ్డి, నాగరాజు, గంగిశెట్టి రాజ్కుమార్ పాల్గొన్నారు.
మంగపేటలో..
మంగపేట : మండలంలోని లక్ష్మీనర్సాపురం పాఠశాలలో స్వామి వివేకానందుడి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ ట్రస్టు సేవా సభ్యు లు బాడిశ నాగ రమేశ్, ప్రఖండ ప్రముఖ్ చౌళం సాయిబాబు, టీచర్ భవాని పాల్గొన్నారు.
ఏటూరునాగారంలో..
ఏటూరునాగారం: మండల కేంద్రంతో పాటు చెల్పాక గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షుడు గండపెల్లి సత్యం, మహిళా మోర్చ మండల కమిటీ అధ్యక్షురాలు పలక గంగ, సంపత్, గడ్డం సత్యం, భవాని, మమత, శ్రీను, సమ్మయ్య, ప్రసాద్, జంపయ్య, తిప్పనపల్లి రమేశ్ పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల : మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేశ్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాంబా బు, కంచర్ల కుమార్, పల్లాల ప్రవీణ్, పంచిక మహేశ్, చింతల రాజేందర్ పాల్గొన్నారు.
మహదేవపూర్లో..
మహదేవపూర్: మండల కేంద్రంలో నెహ్రూ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనం గా జరుపుకున్నారు. సర్పంచ్ శ్రీపతిబాపు, ఎంపీపీ బన్సోడ రాణీబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, నెహ్రూ యూత్ క్లబ్ అధ్యక్షుడు అన్కారి ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
యువత సన్మార్గంలో పయనించాలి
కృష్ణకాలనీ: యువత సన్మార్గంలో పయనించడంతో పాటు స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీవైఎస్వో బుర్ర సునీత హాజరై చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోచ్లు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధిశాఖ అధికారి అరూరి శ్యామల, టీఆర్ఎస్ జిల్లా యూత్ నాయకుడు (కరాటే మాస్టర్) కరాటే శ్రీనివాస్, టీఆర్ఎస్ 23వ వార్డు అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, క్రీడాకారులు కృష్ణ, అశోక్, రాగిని, అథ్లెటిక్స్, తైక్వాండో అసోసియేషన్ సభ్యులు, డీవైఎస్వో సిబ్బంది శివసాగర్, యువకులు పాల్గొన్నారు.