హనుమకొండ సిటీ, జనవరి 11 : ఆన్లైన్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు తెలిపారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్భవన్లో ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, కొత్తగూడెం, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లికి చెందిన టీఎస్ ఐపాస్ వినియోగదారులతో సీఎండీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ఉండేవని, కానీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు మార్గదర్శకత్వంలో పరిశ్రమలకు 24 గంటల మెరుగైన విద్యుత్ను సరఫరా చేయగలుగుతున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు ఆన్లైన్లో కాలపరిమితికి లోబడి సర్వీసుల మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు తమ అభిప్రాయాలను అధికారులు, సిబ్బందికి తెలియజేసి, కంపెనీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు బీ వెంకటేశ్వర్రావు, పీ గణపతి, సంధ్యారాణి, పీ మోహన్రెడ్డి, పారిశ్రామిక వినియోగదారులు, సీజీఎంలు కేఎన్ గుట్ట, రాజుచౌహాన్, మధుసూదన్, తిరుపతిరెడ్డి, జీఎంలు వెంకటరమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.