బీజేపీ నాయకులకు అఖిలపక్ష నేతల అల్టిమేటం
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించే రావాలంటూ హుకుం
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల హామీలను నెరవేర్చాలని డిమాండ్
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించాలని స్పష్టం
సికింద్రాబాద్లో రైల్ నిలయం ముట్టడి.. కేంద్రం వైఖరిపై నిరసన జ్వాల
పాల్గొన్న చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
జిల్లా నుంచి తరలివెళ్లిన టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, టీ ఎమ్మార్పీఎస్ నాయకులు
సిటీబ్యూరో(హైదరాబాద్)/ కాజీపేట, జనవరి 31 : రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చేలా చూడాలని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుంటే బీజేపీ నాయకులను ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టనిచ్చేది లేదని అఖిలపక్షం నేతలు అల్టిమేటం జారీ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మేడారం జాతర, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, జాతీయ రహదారులు, రైల్వే లైన్ హామీలు, డిమాండ్లను నెరవేర్చాలని టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, టీ ఎమ్మార్పీఎస్ నాయకులు సికింద్రాబాద్లోని రైల్ నిలయాన్ని సోమవారం ముట్టడించారు. టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ నేతృత్వంలో బీజేపీయేతర నాయకులు ఇక్కడి నుంచి భారీగా తరలివెళ్లి మహాధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైల్ నిలయ్ ప్రాంతంలో దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చేలా చూడాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత రాకుంటే బీజేపీ నాయకులను ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టనిచ్చేది లేదని అఖిలపక్ష నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈమేరకు టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు సికింద్రాబాద్లోని రైల్ నిలయాన్ని సోమవారం ముట్టడించారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. మహాధర్నాకు టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, టీ ఎమ్మార్పీఎస్ నాయకులు భారీగా తరలివెళ్లగా పోలీసులు మోహరించి నాయకులను అరెస్ట్ చేశారు. అంతకు ముందు హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కాజీపేట రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుంటే బీజేపీ నాయకులను వరంగల్ జిల్లాలో అడుగు పెట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు.
విభజన హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ వరంగల్లో రైల్వే డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కాజీపేట-హుజూరాబాద్-కరీంనగర్ రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రానున్న రోజుల్లో రైల్వే లైన్ పనులు, భూసేకరణ వంటి అన్ని పనులను రైల్వే నుంచే నిధులు వెచ్చించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సిబ్బందితో రైల్వే రైన్లు వేయడం వంటి అనేక కష్టతరమైన పనులు చేయించుకున్నారని, ఇప్పుడు అంతా సెట్ అయ్యాక ఆయా వర్గాల వారికి ఉద్యోగాలు అవసరం లేదని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారని వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. అనంతరం రైల్వే ఇన్చార్జి జీఎంకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాదవ్రెడ్డి, సుందర్రాజ్, వరంగల్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు జంగా రాఘవరెడ్డి, సీపీఐ నాయకులు మేకల రవి, తిరుపతి, భిక్షపతి, సీపీఎం నాయకులు చక్కయ్య, సీపీఐ ఎంఎల్ నాయకులు గోవర్ధన్, అప్పారావు, టీ ఎమ్మార్పీఎస్ నాయకులు భిక్షపతి, రవి, రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇంగ్లిష్తో నైపుణ్యం పెంపొందుతుంది..
పోచమ్మమైదాన్ : ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడాలంటే విద్యార్థులకు ఆంగ్లంలో సంపూర్ణమైన పట్టు ఉండాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. దీంతో విద్యార్థుల్లో నైపుణ్యాలు మరింత మెరుగుపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఆంగ్ల భాష నైపుణ్యం ఉన్నప్పుడే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతూ తెలంగాణకు పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తారు. ఇంగ్లిష్ బోధన కోసం ఉపాధ్యాయులను నియమించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లిషు మాధ్యమంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.-తాళ్లపల్లి ప్రకాశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
విద్యార్థుల భవిష్యత్కు ముందడుగు
స్టేషన్ ఘన్పూర్ : ప్రభుత్వం ప్రకటించిన ‘మన ఊరు-మన బడి’, ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థుల బంగారు భవిష్యత్కు ముందడుగు పడనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతోపాటు ఆంగ్ల మాధ్యమంతో ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగినట్లుగా విద్యార్థులు తయారవుతారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యనిందిస్తున్నది. కరోనా సమయంలో కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నది. ఆంగ్లబోధన ద్వారా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి, ఇంటర్వ్యూలను సునాయాసంగా ఎదుర్కొంటారు.-అవినాశ్ (అక్కపల్లిగూడం పంచాయతీ కార్యదర్శి)