రైతుల ఖాతాల్లో జమకానున్న యాసంగి రైతు బంధు నగదు
జయశంకర్ జిల్లాకు రూ.115, ములుగు జిల్లాకు రూ. 79.41 కోట్లు మంజూరు
రెండు జిల్లాల్లో మొత్తం 1,85,341 మంది రైతులు
కొత్తగా 6733 మందికి లబ్ధి
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/ ములుగు టౌన్ ;ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో ఈ నెల 28వ తేదీ నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమకానున్నాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సర్కారుకు నివేదించింది. కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న వారికి సైతం పెట్టుబడి సాయం అందనుంది. 2018లో రైతు బంధు పథకం ప్రారంభం కాగా మొదట్లో సీజన్కు రూ.4 వేలు అందించింది. 2020 నుంచి ఎకరానికి రూ.5వేల చొప్పున అందిస్తున్నది. వానకాలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,08,002 మంది రైతులకు రూ.114.27 కోట్లు అందించగా యాసంగి 1,10,621 మందికి రూ.115 కోట్లు అందనుంది. ములుగు జిల్లాలో వానకాలంలో 70,881 మందికి రూ 79.23 కోట్లు రాగా ఈ యాసంగి 74,720 మంది రైతుల ఖాతాల్లో రూ.79, 41 కోట్లు జమకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి వరి సాగు చేయని వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తుందని ప్రతి పక్షాలు దుష్ప్రచారం చేయడంతో స్వయంగా సీఎం కేసీఆర్ అర్హులందరికీ రైతు బంధు అందజేస్తామని ప్రకటించడం వారికి చెంపపెట్టయింది.
పంట పెట్టుబడి సాయం నెలాఖరు నుంచి రైతులకు అందనుంది. యాసంగి రైతుబంధు డబ్బులు ఈ నెల 28 నుంచి అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. ఎకరానికి రూ. 5వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. గత వానకాలం కంటే ఈసారి రైతుబంధు అందుకునే వారి సంఖ్య పెరిగింది. జయశంకర్ ములుగు జల్లాలో వర్షకాలంలో 1,08,002 మందికి పెట్టుబడి సాయం అందించగా ఈ యాసంగికి 1,10,621మందికి అందనుంది. కొత్తగా జిల్లాలో 2,894 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. గత వానకాలం జిల్లాకు రూ.114,27,98,397 పెట్టుబడి సాయం మంజూరు కాగా, ప్రస్తుతం రూ.115,00,72,856 మంజూరు చేసింది.
పెరిగిన రైతుల సంఖ్య..
జిల్లాలోని 241 గ్రామ పంచాయతీల పరిధిలో ఈసారి యాసంగి పెట్టుబడి సాయం 1,10,621 మంది రైతులకు అందనుంది. కొత్తగా పాసు పుస్తకాలు పొందిన 2894 మందికి లబ్ధి చేకూరనుంది. ఈనెల 28నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. పెట్టుబడి సాయం తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి ప్రారంభం కానుంది.
ములుగు జిల్లాలో వానకాలంలో 70,881 మంది రైతులకు రూ.79.23 కోట్లు రాగా ఈ యాసంగి పెట్టుబడి సాయం 74,720 మందికి రూ 79. 41 కోట్లు వారి ఖాతాల్లో జమకానున్నాయి. కొత్తగా 3,839 మందికి లబ్ధిదారులకు రైతు బంధు అములు కానుంది.
తప్పుల సవరణకు అవకాశం
రైతులు మార్పులు చేర్పులు చేసుకునేందుకు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి వివరాలు అందిస్తే యాసంగి పెట్టుబడి సాయం మంజూరు కానుంది. కొత్తగా పాస్ బుక్లు పొందిన వారు ఈ నెల 27లోపు దరఖాస్తు చేససుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
ప్రతి పక్షాలకు చెంపపెట్టు..
రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి వరి సాగు చేయని వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తుందని ప్రతి పక్షాలు చేసిన దుష్ప్రచారం చేశాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అర్హులైన ప్రతి రైతుకు యాసంగి పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించడం ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా మారింది.
ములుగులో కొత్తగా 3,839 మందికి లబ్ధి
యాసంగికి ముందే రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ అవుతున్నది. ఈ సీజన్కు జిల్లాలో రూ 79, 41 కోట్లు మంజూరయ్యాయి. రైతుల ఖతాల్లో జమకానున్నాయి.
సాగుకు ముందే రైతు బంధు
ప్రభుత్వం ప్రతి యేటా పెట్టుబడి సాయం సీజన్కు ముందే అందిస్తున్నది. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నందున ఎరువులకు ఉపయోగపడతాయి.