వర్ధన్నపేట, ఫిబ్రవరి 17 : వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరువాగు ఒడ్డున ఉన్న రాజరాజేశ్వరాలయం, పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, సాయిబాబా మందిరం, జామా మసీద్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్ర జాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. 14 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించిన కేసీఆ ర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇలాం టి మహనీయుడు వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ తెలంగాణను మరింత ముందు కు తీసుకువెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, కౌన్సిలర్లు రవీందర్, రామకృష్ణ, పార్టీ నాయకులు పులి శ్రీనివాస్, కొండేటి శ్రీనివాస్, సిలువేరు కుమారస్వామి, పూజారి రఘు, మాధవరావు, సుభాష్ పాల్గొన్నారు.
కాశీబుగ్గ : గ్రేటర్ పరిధి 3వ డివిజన్ అరపల్లిలోని అయ్యప్పస్వామి హరిహర క్షేత్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి దయతో కేసీఆర్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీభారాణి, పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, డివిజన్ అధ్యక్షుడు నెరెళ్ల రాజు, జన్ను అనిల్కుమార్, ముడుసు నరసింహ, పండుగ రవీందర్రెడ్డి, బొచ్చు రాజు, చీర్ల రవీందర్, రమేశ్పాల్, వీర యాకూబ్, బొల్లం విజయ్, ఇట్యాల సతీశ్, ఇట్యాల శిరీష పాల్గొన్నారు.