స్టేషన్ ఘన్పూర్ : డివిజన్ కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు సంతాపం తెలిపారు. డివిజన్ చెందిన చింత భరత్కుమార్ (మల్లయ్య) (48) మంగళవారం రాత్రి ఎస్సీ కాలనీ సమీపంలో గుర్తు తెలియని ఆటో ఢీకొంది. చికిత్స కోసం యంజియంకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ కన్వినర్ ఇనుగాల నర్సింహరెడ్డి, మండల రైతుబంధు సమితి సభ్యుడు చింతకుంట్ల నరేందర్రెడ్డితో పాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు సంతాపం తెలిపారు.