జయశంకర్ భూపాలపల్లి : ఆటో బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరికి గాయలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మహా ముత్తారం మండలం స్తంభంపల్లి(పి.కే)గ్రామంలోని మూల మలుపు వద్ద చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ చెందిన భక్తులు ఆటోలో మేడారం వెళ్లి వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ మధ్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.