వర్ధన్నపేట/సంగెం/నల్లబెల్లి/నెక్కొండ/గీసుగొండ/నర్సంపేటరూరల్/రాయపర్తి/ఖానాపురం/పర్వతగిరి, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను మంగళవారం ఊరూరా పంపిణీ చేశారు. వర్ధన్నపేటలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుధీర్, రాజమణి, రవీందర్, రామకృష్ణ, సోమయ్య, అజీమ్ పాల్గొన్నారు. సంగెం మండలంలోని గొల్లపల్లి, నార్లవాయి, నల్లబెల్లి, గాంధీనగర్లో చీరల పంపిణీని ఎంపీపీ కందకట్ల కళావతి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. మేరుగు మల్లేశం, కోడూరి రజిత, మామిడాల దర్శన్, ఏకాంబరం, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీటీసీలు కొనకటి రాణి-మొగిలి, కట్ల సుమలత, ఉపసర్పంచ్ మాదినేని కోటేశ్వర్, మన్సూర్ అలీ, కొనకటి మొగిలి, కోడూరి రమేశ్ పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లిలో సర్పంచ్ శ్రీలత మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. నెక్కొండ వాగ్యానాయక్తండాలో సర్పంచ్ లావుడ్యా హరికిషన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ లావుడ్యా సరోజన పాల్గొని బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని గ్రామాలతోపాటు వరంగల్ 15, 16వ డివిజన్లో చీరలు పంపిణీ చేశారు. కార్పొరేటర్లు సుంకరి మనీషా, ఆకులపల్లి మనోహర్, సర్పంచ్లు అల్లం బాలిరెడ్డి, నాగేశ్వర్రావు, పూండ్రు జైపాల్రెడ్డి, మల్లారెడ్డి, జ్యోతి, రజిత, కవిత, రజిత, అమ్మి, సరోజన పాల్గొన్నారు. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీలో సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న, ఆకులతండాలో సర్పంచ్ బానోత్ రాము మహిళలకు చీరలు అందించారు. కార్యదర్శి నూర్జహాన్, వార్డు సభ్యులు బొడిగె వినయ్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రాయపర్తి మండలం బురహాన్పల్లి, గన్నారం, మైలారం, రాగన్నగూడెం, వెంకటేశ్వరపల్లి, రాయపర్తి, ఆర్అండ్ఆర్ కాలనీలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సర్పంచ్లతో కలిసి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్లు సూదుల దేవేందర్రావు, కుక్కల భాస్కర్, లేతాకుల సుమతీయాదవరెడ్డి, రెంటాల గోవర్ధన్రెడ్డి, గూబ యాకమ్మ ఎల్లయ్య, గారె నర్సయ్య, చెడుపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఖానాపురం మండలం ధర్మారావుపేటలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ వెన్ను శ్రుతి, పూర్ణచందర్, కరుణాకర్, వెంకన్న పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని రావూర్, మోత్యాతండా, ఏనుగల్, చింతనెక్కొండ, కల్లెడ, బూరుగుమళ్ల, అనంతారం, వడ్లకొండలో సర్పంచ్లు చీరలు పంపిణీ చేశారు.
నగరంలో చీరల అందజేత
వరంగల్ నగరంలో మంగళవారం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. 25వ డివిజన్లోని మహిళలకు కార్పొరేటర్ బస్వరాజు శిరీషా-శ్రీమాన్ చీరలు అందించారు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరీమాబాద్ ప్రాంతంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. కాశీబుగ్గ 19వ డివిజన్లో కార్పొరేటర్ ఓని స్వర్ణలతా భాస్కర్ చీరలు పంపిణీ చేసి మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో భూక్యా మోతీలాల్నాయక్, ఈటల ఉమేందర్, దేవర ప్రసాద్, వేముల నాగరాజు, గణిపాక సుధాకర్, క్యాతం రంజిత్, కండేరావు, ఎదులాపురం బ్రహాచారి, ఆర్పీలు పాల్గొన్నారు. 20వ డివిజన్లో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ నరేంద్రనగర్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, ఇక్బాల్, చిమ్మని గోపి, పరికిపండ్ల వంశీ, కవిత, మెప్మా, సీఈవో రాజ్కుమార్ పాల్గొన్నారు. వరంగల్ 24వ డివిజన్ కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి-శిరీష్ ఆధ్వర్యంలో ఎల్లమ్మబజార్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, సీవో మాధవి, ఆర్పీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ 22వ డివిజన్ వాసవీకాలనీలోని ఇన్నర్ వీల్ క్లబ్లో టీఆర్ఎస్ నాయకుడు మావురపు విజయభాస్కర్రెడ్డి చీరలు పంపిణీ చేశారు.