స్టేషన్ ఘన్పూర్ : నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్య భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. ఆదివారం రూ. 50లక్షల నిధులతో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేశ్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే డా. రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 13వేల జనాభ ఉందని, రానున్న రోజుల్లో మున్సిపాలిటి కానుందని అన్నారు. రెండు కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మాణం చేసుకోవడం, బీటి రోడ్లు వేసుకోవడం జరిగిందన్నారు.
ఆర్సియం చర్చి నుంచి జాతీయ రోడ్డు వరకు 15లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం త్వరలో వేస్తామన్నారు. అలాగే ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మార్కెట్ సముదాయానికి అనుమతులు వచ్చాయని, అట్టి పనులను త్వరలోనే చేపడుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గాంధీ చౌరస్తా నుంచి రైల్వేగేటు వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టంను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడ డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, ఉప సర్పంచ్ నీల ఐలయ్య, ఎంపీటీసీలు సింగపురం దయాకర్, గన్ను నర్సింహులు, మునిగెల రాజు, ఎంపీడీవో కుమారస్వామి, వార్డు సభ్యులు, పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, ఆర్అండ్బి వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మాతంగి దేవయ్య, శంకర్ పాల్గొన్నారు.