దుగ్గొండి, సెప్టెంబర్ 1 : వరి సాగులో రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడిని సాధించొచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన రైతు రాస చేరాలు పొడి దుక్కిలో సాగు చేసిన వరి పంటను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొడిదుక్కిలో వరి సాగు విధానం ఎంతో లాభదాయకమన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చన్నారు. కూలీల సంఖ్య గణనీయంగా తగ్గి తక్కువ కాలంలో పంట కోతకు వస్తుందన్నారు. పొడిదుక్కిలో వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమల, మండల వ్యవసాయధికారి చిలువేరు దయాకర్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ బండి రాజమల్లు, ఏఈవో విశ్వశాంతి, రాజేశ్, మధు, వీఆర్ఏ ఐలుమల్లు, యార శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.