త్వరలోనే నెరవేరనున్న ప్రజల కల
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
రోడ్ల నిర్మాణానికి రూ. 3.43 కోట్ల నిధులు
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
చెన్నారావుపేట, మార్చి 25: తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల చిరకాల స్వప్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రహదారుల నిర్మాణంతో నెరవేరుస్తున్నారని కొనియాడారు. మండలంలోని లింగాపురం గ్రామం నుంచి గోపగానితండా వరకు 1.5 కిలోమీటర్ల బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 82.50 లక్షల నిధులు మంజూరు కాగా, శుక్రవారం రహదారి పనులకు ఎమ్మెల్యే పెద్ది శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లింగాపురం గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న తమ కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్ తప్పెట రమేశ్, క్లస్టర్ ఇన్చార్జి కంది కృష్ణచైతన్యారెడ్డి, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, ఎంపీటీసీ పసునూటి రమేశ్, ఉపసర్పంచ్ రాజ్కుమార్, టీఆర్ఎస్ లింగాపురం అధ్యక్షుడు తప్పెట రాజేందర్ పాల్గొన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా సర్కారు చర్యలు
దుగ్గొండి: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని జాఫర్పల్లి నుంచి మైసంపల్లి ఎస్సీకాలనీ వరకు 1.5 కి.మీ బీటీ నిర్మాణానికి రూ. 93.50 లక్షల నిధులతో చేపట్టిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంతో గ్రామాల్లో సైతం రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధి చెందుతాయని పెద్ది అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, పీఏసీఎస్ చైర్మన సుకినె రాజేశ్వర్రావు, ఊరటి మహిపాల్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు
నర్సంపేట రూరల్: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, కనీస వసతులు కల్పించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చంద్రయ్యపల్లి శివారులోని జడ్పీరోడ్డు నుంచి రాజేశ్వర్రావుపల్లి వరకు 1.3 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పెద్ది శంకుస్థాపన చేశారు. రూ. 74.25 లక్షల నిధులతో బీటీరోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాలు, పల్లెల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, సర్పంచ్లు బొజ్జ యువరాజ్, బరిగెల లావణ్య, కిశోర్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, నాయకులు కట్ల సుదర్శన్రెడ్డి, పెద్ది తిరుపతిరెడ్డి, గంధం జగన్మోహన్రావు, కడారి కుమారస్వామి, పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జ స్వామి, టీ తిరుపతి, బీ రాజు, జర్పుల వీరన్న, మామిడి ఐలయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు.
రోడ్ల పునరుద్ధరణే లక్ష్యం..
నల్లబెల్లి: రోడ్ల పునరుద్ధరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బోల్లోనిపల్లె సమీపంలోని 365 జాతీయ రహదారి నుంచి ధర్మారావుపల్లె వరకు రూ. 93.50 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకంవర్గంలో దెబ్బతిన్న అన్ని రోడ్లనూ పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి సీఆర్ఆర్ గ్రాంటు నిధులు రూ. 343.75 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్గౌడ్, సర్పంచ్లు లసుమమ్మ, చీకటి ప్రకాశ్, సిద్దూరి రత్కాకర్రావు, సృజనా లింగమూర్తి, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్రావు, డీఈ ఇజ్జగిరి, మాజీ ఎంపీటీసీ సారయ్య పాల్గొన్నారు.