‘డబుల్’ ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నది
త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
దూపకుంటలో ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన
ఖిలావరంగల్, మార్చి 25: వరంగల్ దూపకుంటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దూపకుంటలో నిర్మిస్తున్న రెండు పడకల ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. పనులు చకచకా సాగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్నారు. అలాగే, సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునే వారికి రూ. 3 లక్షలు అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
మౌలిక వసతుల కల్పనలో ఆదర్శం
వరంగల్చౌరస్తా: ప్రజా అవసరాలను గుర్తించి, వాటిని పరిష్కరించడంతోపాటు ప్రజలకు మౌలిక వసతులు సమకూర్చడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 28వ డివిజన్ సంతోషిమాతకాలనీలో కార్పొరేటర్ కల్పన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు పనులను ప్రారంభించారు. చాలా ఏళ్లుగా కనీస రోడ్డు మార్గం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న సంతోషిమాత కాలనీ, బృందావనం కాలనీ, సాయినగర్, ఎన్టీఆర్నగర్ వాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో రోడ్డును వంద ఫీట్ల మేర విస్తరిస్తున్నట్లు చెప్పారు. త్వరితగతిన రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.