చెన్నారావుపేట/గీసుగొండ/కరీమాబాద్/వర్ధన్నపేట/రాయపర్తి, సెప్టెంబర్ 16: పోషణ మాసోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో స్పెషలాఫీసర్ బాలకృష్ణ, ఎంపీపీ బదావత్ విజేందర్ ఆధ్వర్యంలో ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన, మూడేళ్లు నిండిన పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు సీమంతాలు చేయించారు. గీసుగొండ మండలం నందనాయక్తండాలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి మురళీధర్రెడ్డి, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరీమాబాద్లోని పలు అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్లు రాధ, చంద్రకళ పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్ పాల్గొన్నారు. రాయపర్తి మండలం పెర్కవేడులో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్, వర్ధన్నపేట సీడీపీవో శ్రీదేవి, సర్పంచ్ చిన్నాల తారాశ్రీరాజబాబు, ఎంపీటీసీ అనుషారాజబాబు, ఏసీడీపీవో హైమావతి పాల్గొన్నారు.