వర్ధన్నపేట/పర్వతగిరి/రాయపర్తి, సెప్టెంబర్ 15: గోవులను సంరక్షిస్తేనే భవిష్యత్లో రైతుల మనుగడ సాధ్యమవుతుందని, తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన్నారు. వర్ధన్నపేట మండలంలోని రామవరంలో వేంకటేశ్వర గోశాల ఆధ్వర్యంలో బుధవారం రైతులకు ఉచితంగా లేగదూడెలను పంపిణీ చేశారు. సేంద్రియ వ్యవసాయం వల్ల ఆరోగ్యకర సమాజం తయారవుతుందన్నారు. కార్యక్రమంలో గోశాల సభ్యులు యాకూబ్, సర్పంచ్ వెంకట్రెడ్డి, రామచంద్రు, రమేశ్, అంజయ్య, రైతులు పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరి మండలంలోని పెద్దతండాలో మహేశ్వరి గోశాల ఆధ్వర్యంలో రైతులకు పది లేగదూడలనుమహేశ్ అగర్వాల్ సమక్షంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గణేశ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని కేశవాపురంలో పది నిరుపేద రైతు కుటుంబాలకు నందీశ్వర గోశాల నేతృత్వంలో ఉచితంగా లేగదూడలను పంపిణీ చేశారు. మహేశ్ అగర్వాల్, గోశాలల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాడిపల్లి రాజేశ్వర్రావు, నందీశ్వర గోశాల అధ్యక్షుడు లావుడ్యా రవీందర్నాయక్, ప్రతినిధులు పాల్గొన్నారు.