వెంకటాపూర్, సెప్టెంబర్ 4 : ‘ఆజాదీ కా అమృత్ మ హోత్సవం’ ఫిట్ ఇండియా రన్ 2.0 లో భాగంగా రామప్ప దేవాలయం నుంచి లక్ష్మీపురం వరకు (4కిలోమీటర్ల) సీఆర్పీఎఫ్ కమాండెంట్ ఆర్కే పాండా ఆధ్వర్యంలో సైకిల్ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఆదర్ష్సురభి, ఏఎస్పీ రూపేశ్ మాట్లడుతూ.. ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేయాలన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఫిట్గా ఉండడానికి ప్రాముఖ్యతనిస్తారని, ప్రజలు కూడా ఫిట్గా ఉండాలని ప్రచా రం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం వారు రామప్ప నుంచి లక్ష్మీపురం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాలంపేట సర్పంచ్ డోలి రజిత ఒక్కరే మహిళల తరఫున పాల్గొనడంతో ఆమెను అభినందించారు. తర్వాత అధికారులందరూ రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డిప్యూ టీ కమాండెంట్ జయదేవ్ మండల్, అసిస్టెంట్ కమాండెంట్ ఏసుదాసు, ములుగు సీఐ శ్రీధర్, ఎస్సై రమేశ్, పోలీస్, సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.