నర్మెట: నర్మెట మండలంలోని ఆగాపేట గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రూ.6 లక్షల 50వేల విలువైన అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు. ను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.సంతోష్, సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు ఆగాపేట గ్రామంలో వ్యవసాయ బావి వద్ద నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దాడిలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యంను సీజ్ చేశామని ఆయన చెప్పారు. వీటి విలువ సుమారు రూ.6 లక్ష 50వేలు ఉంటుందని చెప్పారు. వ్యవసాయ బావి వద్ద నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు తెలిపారు.