జనగామ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరిగడ్డికి పెట్టిన నిప్పు అంటుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చిల్పూర్ మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన కనుకం చంద్రయ్య (64) తన పొలంలో వరి గడ్డి అంటు పెడుతుండగా ప్రమావశాత్తు మంటల్లో పడి సజీవదహనం అయ్యాడు. మృతుడికి భార్య యాదమ్మ, ఇద్దరు కొడుకులు, కూతురు ఉంది. చంద్రయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.