స్టేషన్ ఘన్పూర్: వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని నమలిగొండ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమిలిగొండ గ్రామ ప్రత్యేకాధికారి , ఎంపీవో కె. సురేశ్ ను గ్రామంలో 18ఏళ్ళు పై బడినవారు ఎంతమంది ఉన్నారు. ఎంత మందికి వ్యాక్సిన్ వేశారు. ఇంకా ఎంతమంది వ్యాక్సిన్ టార్గెట్ ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో 510 టార్గెట్ ఉండగా ఈ నెల మూడు వరకు టార్గెట్ పూర్తి చేయాలని, ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించాలని, ఇక్కడ లేనివారి వివరాలు తీసుకుని ఫోన్ ద్వారా వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా వివరాలు సేకరించి వారు కూడా వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ భాస్కర్, డీఆర్డీవో రాంరెడ్డి, జిల్లా వైద్యాధికారి మహేందర్, డాక్టర్ ప్రసన్నకృష్ణ, సర్పంచ్ ఉప్పలస్వామి, ఎంపీటీసీ రజాక్ యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రచారకార్యదర్శి మోటం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.