జనగామ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. మహిళలతో కలిసి కాటమయ్యకు బోన మెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు.
జనగామ జిల్లాలోని పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. మహిళలతో కలిసి మంత్రి కాటమయ్యకు బోనమెత్తారు. pic.twitter.com/t3wpUhIJ6G
— Namasthe Telangana (@ntdailyonline) May 31, 2022
మోత్యా తండాలో దుర్గమ్మ పండుగ ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. లక్ష్మణ్ తండాలో జరిగిన దుర్గమ్మ పండుగ కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ అభివృద్ధిపై చర్చించారు. అలాగే దేవరుప్పులకు చెందిన నీలారపు పెద్ద వెంకన్నకు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. కొడకండ్ల మండలం రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ ఉత్సవాల్లో మంత్రి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.