కొడకండ్ల, ఫిబ్రవరి 18 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ వైస్ చైర్మన్ కే వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో మొండ్రాయి గ్రామం లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాలు, పల్లెలు, శివారు ప్రాంతా ల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మంత్రి ఎర్రబెల్లి కృషి మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వసతులతో కూడిన అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్ర భుత్వం నుంచి వచ్చే ఫలాలు అందించాలనే సంకల్పం తో దశ దిశ కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ జ్యోతి, టీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిందే రామోజీ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు డీ వెంకటేశ్వర్రావు, సర్పంచ్ ఊర్మిళ సోమయ్య, ఏఎంసీ డైరెక్టర్ డీ సతీశ్, దేవస్థానం డైరెక్టర్ నర్సయ్య వెంకన్న, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు డీ సతీశ్గౌడ్, టీ శోభన్, యాదగిరి పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట..
బచ్చన్నపేట: ప్రజా సంక్షేమంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలోని పలు వీధుల్లో సీసీ రోడ్డు నిర్మాణాల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగం సతీశ్రెడ్డితో కలిసి ఆ యన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో దశల వారీగా అన్ని వీధుల్లో సీసీరోడ్డు, కాల్వలు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే గ్రామా లు పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయన్నా రు. సీఎం కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ బంగారు తెలంగాణగా మారబోతుందన్నారు. కేసీఆర్ పాలనపై ప్రపంచ దేశాలే ఎదురుచూస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ కల్యాణలక్ష్మి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన గుర్తుజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గిరబోయిన అంజయ్య, బావండ్ల కృష్ణంరాజు, షబ్బీర్, కర్ణాల వేణుగోపాల్, కాపర్తి హరిప్రసాద్, కే కరుణాకర్, నర్సిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.