జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 14 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న తెలంగాణ సర్కారు దివ్యాంగుల కోసం ఉప కరణాలు పంపిణీ చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద సోమవారం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగులకు జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి ఆయన ఉపకరణాలు పంపిణీ చేశారు. ఆరు స్కూటీలు, ఆరు బ్యాటరీ ట్రై సైకిల్స్, ల్యాప్టాప్, 20 ట్రై సైకిల్స్, 21 హియరింగ్ మిషిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పేదలందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. త్వరలో మరింత మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసేలా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు కృషి చేస్తారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన వాటాను రాబట్టడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చొరవ చూపాలన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చే వాటా లభిస్తే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీ నిర్మాణం, సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, జనగామ జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేయవచ్చన్నారు. వీటితోపాటు రోడ్ల విస్తరణ, ఆటోనగర్ నిర్మించుకోవడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చన్నారు. అనంతరం తెలంగాణ దివ్యాంగుల వేదిక క్యాలెండర్తో పాటు మణికంఠ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ క్యాలెండర్ను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి ఆవిష్కరించారు. దివ్యాంగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి, డీసీపీవో రవికాంత్, సీడీపీవో రమాదేవి, జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ రాంప్రసాద్, స్థానిక వార్డు కౌన్సిలర్ దేవరాయ నాగరాజు, ఎంపీపీ మేకల కళింగరాజు, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, పగిడిపాటి సుధ, స్వరూప, పల్లవి, మేకల సమ్మయ్య, గజ్జి శంకర్, బొట్ల సుమతి, బిర్రు నగేశ్, నీల యాదగిరి, ఊడ్గుల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే
జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డు మార్గంలో శ్రీలక్ష్మి మహేంద్ర ట్రాక్టర్ షోరూంను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు ఎక్కలదేవి సింహాద్రికి సంబంధించిన లక్ష్మినర్సింహ కిరాణం అండ్ జనరల్ స్టోర్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అక్కడే టీఆర్ఎస్ యువ నాయకుడు అబ్బాస్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మి ట్రాక్టర్ షోరూం యజమాని జక్కుల కుమార్, టీఆర్ఎస్ నాయకులు రాం మనోహర్, యాదగిరి, సమద్, నర్సింహులు, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.