స్టేషన్ ఘన్పూర్/పాలకుర్తి రూరల్/బచ్చన్నపేట/రఘునాథపల్లి ఫిబ్రవరి 14 : బీజేపీని ప్రజలు పాతర పెట్ట్టే రోజులు దగ్గర పడ్డాయని టీ పీసీసీ సభ్యుడు దొమ్మాటి సాంబయ్య అన్నారు. సోమవారం టీ పీసీసీ పిలుపు మేరకు, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా,అతని పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో దొమ్మాటి సాంబయ్య, పీసీసీ కార్యదర్శి గంగారపు అమృతరావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసే అబద్దాల కోరు బీజేపీని ప్రజలు బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొలిపాక సతీశ్, మాజీ మండల అధ్యక్షుడు కత్తుల కట్టయ్య, బొజ్జ సమ్మయ్య యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగబండి సంతోష్, నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి నీల రాకేశ్, గోనెల ఎల్లయ్య, కిరణ్రెడ్డి, గట్టయ్య, బిక్షపతి, బాలరాజు, రవి, రామ్లాల్, పద్మ, శ్రీనివాస్, తిరుపతి, వక్కల రాజు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి పోలీస్స్టేషన్లో ఎస్సై కొలిచలం వంశీకృష్ణకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, అడ్డూరి రవీందర్రావు, అనుముల మల్లారెడ్డి, సర్పంచ్ బక్క పుల్లయ్య, గడ్డం యాక సోమయ్య, జలగం కుమార్, బైర్ భార్గవ్, చిలువేరు పెంటయ్య, మాదాసు హరీశ్, గాదేపాక భాస్కర్, పులి భాస్కర్, నారగోని ఎల్లయ్య పాల్గొన్నారు. బచ్చన్నపేట పోలీస్స్టేషన్లో కాంగ్రేస్ నేతలు పిర్యాదు చేశారు. పార్టీ మండల అధ్యక్షులు వంచ వెంకట్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోడూరి మహత్మచారీ, ఎంపీటీసీ సభ్యులు నల్లగోని పుష్పబాలకిషన్గౌడ్, ఆల్వాల రాధ ఎల్లయ్య, నాయకులు సిద్దారెడ్డి, రమేశ్, వేణవందన తదితరులు పాల్గొన్నారు. రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో పార్టీ మండల అధ్యక్షులు కోళ్ల రవిగౌడ్ ఎంపీపీ మేకల వరలక్ష్మి-నరేందర్, నాయకులు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ మాసంపల్లి లింగాజీ, ఎంపీటీసీలు రచ్చసోమనాథం, పేర్నే ఉషా, అల్లిబిల్లి క్రిష్ణ, నాయకులు కడారి చిన్న నగేశ్, కావాటి భాస్కర్, షబ్బీర్మియా, గుగులోతు కొంరెళ్లి, ఇబ్రహీం, పృద్వీ, మేడిపల్లి వెంకటేశ్వర్లు, చాట్ల మధు, వి క్రమ్, జానీ తదితరులు పాల్గొన్నారు.