జనగామ రూరల్, నవంబర్ 27 : ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందే విధంగా అధికారు లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి తెలిపారు. మండలంలోని శామీర్పేట, పెంబర్తి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన ఆదివారం ఆకస్మిక తనిఖీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజల సౌకర్యార్థం పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ప్రభుత్వం నిర్మించిన ట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా మరణి స్తే వైకుంఠధామాల్లో దహన సంస్కారాలు చేయడంతోపాటు 24గంటల్లో మరణ ధృ వీకరణ పత్రం జారీ చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలను యువత, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చే యడానికి నర్సరీల్లో అవసరమైన మట్టి, వి త్తనాలు, కవర్లు సిద్ధం చేసుకుని విత్తనాలు నాటుకోవాలన్నారు. ఎండిపోయిన మొక్క ల స్థానంలో కొత్తవి నాటి వాటిని సంరక్షించాలన్నారు. తడిపొడి చెత్తను వేరుచేసి త ద్వారా తయారు చేసిన ఎరువులను మొక్కలకు వేయాలన్నారు. గ్రామాలు పరిశుభ్రం గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎంపీడీవో ఎండీ హసీం, ఏపీవో భిక్షపతి, టీఏ అనిల్, కార్యదర్శి ఇప్తీకారుద్దీన్, కారోబార్ పాషా పాల్గొన్నారు.