జనగామ : సద్దుల బతుకమ్మ పండుగకు బతుకమ్మకుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, సంబురాలు జరుపుకునేందుకు వచ్చే మహిళలకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం బతుకమ్మకుంటలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై మున్సిపల్ కమిషనర్ నర్సింహాకు సూచనలు చేశారు. జనగామకు తలమానికంగా తీర్చిదిద్దిన బతుకమ్మకుంటలో పట్టణం నలుమూలల నుంచి వేల సంఖ్యలో మహిళలు పెద్దబతుకమ్మలతో ఆడుకునేందుకు వస్తారని, వారి కోసం లైటింగ్, సౌండ్ సిస్టమ్, తాగునీరు, వైద్యం, రోడ్డు వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పెద్దబతుకమ్మలతో వచ్చే మహిళలకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా గ్రౌండ్ను చదును చేయాలని, నీటి కొలను వద్ద గజఈతగాళ్లను ఉంచాలని, చెత్తచెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మున్సిపల్ పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, 2వ వార్డు కౌన్సిలర్ వాంకుడోతు అనిత, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, టీఆర్ఎస్ నాయకులు జైన రమేశ్ ఉన్నారు.