సంగెం, ఏప్రిల్7: సంగెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల దాఖలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంగెం సొసైటీలోని 13 టీసీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల వేయనున్నారు. ఈనెల 16న సంగెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో రోజు 11 నామినేషన్లు స్వీకరించినట్టు ఎన్నికల అధికారి సీ.నాగ నారాయణ తెలిపారు. గతంలో సంగెం సొసైటీకి చైర్మన్గా పనిచేసిన తిమ్మాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వేల్పుల కుమారస్వామి నామినేషన్ దాఖలు చేశాడు.
ఇవి కూడా చదవండి..
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాకేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!