పల్లె ప్రగతి పనుల్లో జయశంకర్ భూపాలపల్లి వెనుకంజ
గడువు ముగిసినా పూర్తికాని వైనం
సగం కూడా కంప్లీట్ కాని కల్లాల నిర్మాణం
వైకుంఠధామాల్లోనూ పురోగతి కరువు
గ్రామాలు అభివృద్ధి చెంది పచ్చదనం, పరిశుభ్రత వెల్లి విరియాలని రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని స్వయంగా పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆదేశాలిచ్చినా ఇక్కడి అధికారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా జిల్లాలో ని ప్రతి మండలంలో సంబంధిత రాష్ట్ర పరిశీలకులు సైతం పనుల పురోగతిని పరిశీలించినా లెక్క చేయలేదు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లె ప్రగతి పనుల్లో లక్ష్యానికి చాలా దూరంలో ఉంది. జిల్లాలో 11 మండలాల పరిధిలో 241 సెగ్రిగేషన్ షెడ్లు మంజూరు కాగా, 239 మాత్రమే పూర్తయ్యాయి. మరో రెండు నిర్మాణ దశలో ఉన్నాయి. 241 వైకుంఠధామాల్లో 178 మాత్రమే పూర్తి కాగా, 63 నిర్మాణాల్లో పనులు కొనసాగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు 382 మంజూరు కాగా, 380 పూర్తయి మరో రెండు పూర్తి కావాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో 1379 కల్లాలను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటి వరకు కేవలం 141 మాత్రమే పూర్తయ్యాయి. 594 నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా, 644 కల్లాల్లో పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
గడువు విధించినా బేఖాతర్
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని గడువు విధించినా అధికారులు, ప్రజాప్రతి నిధులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. వైకుంఠ ధామాల్లో దహన సంస్కారాలు నిర్వహించడానికి ప్రధానం గా నీటి వసతి ఉండాలి. కానీ, చాలా చోట్ల వైకుంఠధామాలు నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ వాటిలో నీటి సమస్యలు ఉన్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. తూతూమంత్రం గా నిర్మించి వదిలేసినట్లు తెలుస్తోంది.
కొరవడిన సమన్వయం లోపం..
పల్లె ప్రగతి పనులు పూర్తి చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపం కొరవడినట్లు స్పష్టమవుతోంది. వీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే గత ఫిబ్రవరి నెలలో జిల్లా 31 ర్యాంక్లో నిలిచింది. కనీసం రాష్ట్రస్థాయిలో చివరి ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా వారిలో స్పందన కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పను లను పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
హజ్ యాత్రికులకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి : సౌదీ ప్రభుత్వం