జనగామ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 1: జనగామ జిల్లా కేం ద్రంలో ఉన్న బండకుంట భూ ములను దళితులకు కేటాయించాలని పలు దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కుంట వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ పగిడిపాటి సుధాసుగుణాకర్రాజు, నాయకులు పసుల ఏబేల్, ఉడుగుల కిష్టయ్య, ఉడుగుల యాదగిరి, ఉడుగుల నర్సింహులు, రావెల ర వి, మల్లిగారి రాజు, లెనిన్ మాట్లాడారు. బండకుంటను కుమ్మరికుంటగా మార్చి, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 1972-73లో తమకు ఏక్సాల్ పట్టా కింద భూములను కేటాయించగా నందమూరి తారకనగర్ అని పేరుకూడా నామకరణం చేసుకున్నామన్నారు.
290 సర్వే నంబర్లో 7.02 గుంటల భూమి ఉండగా అందులో నాలుగెకరాలు నర్సరీకి కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన భూమిలో దళితులు గుడిసెలు వేసుకున్నారన్నారు. ఇండ్ల నిర్మాణం చేసుకునే క్రమంలో అప్పటి అధికారులు, పోలీసుల సహాయంతో తమను బయటకు వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు కుండల తయారీకి మట్టిని తీసుకెళ్లేలా అవకాశం కల్పించారే తప్ప ఇది కుమ్మరికుంట కాదన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుంటను కబ్జా చేసినైట్లెతే ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. కుంటకట్ట పరిధిలో గుడిసెలు వేసుకునేందుకు తామే కట్టను చదును చేసుకున్నామే తప్ప అందులో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ముఖ్య నాయకుల కోసం సర్క్యూట్ గెస్ట్హౌజ్ నిర్మించాలని తామే ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. చీటికి మాటికి కబ్జాల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చుడండి
ట్రేడ్ లైసెన్సుల పునరుద్దరణకు రేపు తుదిగడువు