హైదరాబాద్ : ట్రేడ్ లైసెన్సుల పునరుద్దరణకు తుదిగడువు బుధవారం ముగియనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ట్రేడ్ లైసెన్సులు పునరుద్దరించుకోకుంటే ఆలస్య రుసుం తప్పదని హెచ్చరించింది. ట్రేడ్ లైసెన్సు ఫీజుకు అదనంగా అపరాధ రుసుం వసూలు చేయనున్నట్లు పేర్కొంది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే 100 శాతం జరిమానా విధించినట్లు వెల్లడించింది. మొదటి నెలకు లైసెన్స్ ఫీజుపై 10 శాతం జరిమానా విధిస్తామంది. పౌరులు కొత్త ట్రేడ్ లైసెన్సులకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ట్రేడ్ లైసెన్సుల గురించి ghmc.gov.in లో పూర్తి సమాచారం అందుబాటులో ఉందంది.