జనగామ : సీఎం కేసీఆర్ రాష్ర్ట ప్రజలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తు పేదలకు అండగా నిలిచడని మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు అన్నారు. దేవరుప్పుల మండలం వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారులకు రూ. 5,46,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ నిధి నిరుపేదలకు వరంగా ఉందన్నారు. పేదలకు వైద్యం భారం కాకుండా విలువైన వైద్యాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు.