నర్మెట:మండలంలోని మాన్సింగ్తండా గ్రామ పరిధిలో గుడుంబా విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు ఎస్సై చందావత్ రవికుమార్ శనివారం తెలిపారు. మాన్సింగ్తండా పరిధిలోని మాలోత్ భిక్షపతి అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఈ మేరకు అతని ఇంట్లో తనిఖీ చేయగా 5 లీటర్ల గుడుంబా లభించింది. దీంతో దానిని సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా నిషేధిత పదార్ధాలు గుట్కా, గంజాయి, గుడుంబా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు