విజయగర్జనతో మరింత సత్తా చాటాలి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
బచ్చన్నపేటలో టీఆర్ఎస్ మండల స్థాయి సమావేశం
హాజరైన రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి
బచ్చన్నపేట, అక్టోబర్ 23 : టీఆర్ఎస్ కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా అభివృద్ధి సంక్షేమంలో నంబర్వన్గా నిలిపిన కేసీఆర్ సారథ్యంలో పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు అవుతుందని ఆయన గుర్తు చేశారు. అందుకే వచ్చే నెల 15న వరంగల్లో విజయగర్జన పేరిట (20 ఏండ్ల టీఆర్ఎస్ పండుగ) జరుపుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీనిధిగార్డెన్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోడిగం చెంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీవైస్చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మిఅంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు, వైస్ ఎంపీపీ అనిల్రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సతీశ్రెడ్డి, కనుకయ్య, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ జనగామ నియోజకవర్గలోని అన్ని మండలాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజలకు ఒరుగబెట్టేది ఏమి లేదన్నారు. నేడు ప్రతి ఊరిలో శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, చెత్త తరలింపునకు సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. కరెంటు లోవోల్టేజీ సమస్యలు లేకుండా సబ్స్టేషన్లు మంజూరు చేసుకున్నామన్నారు.
ఏ ఒక్క మహిళ బిందె తీసుకుని వీధుల్లోకి వెల్లకుండా భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని అందిస్తున్నామన్నారు. తెలంగాణలో చేస్తున్న నిర్మాణాలకు అడ్డుపడడం కాదు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించాలని బండి సంజయ్ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ వైసే ఉన్నారన్నారు. ముఖ్యంగా రాష్ట్రం వచ్చాక జరిగిన అభివృద్ధిపై పార్టీ తరఫున మీడియా ఇన్చార్జీల ద్వారా ప్రజలకు సమాచారం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జనకు మండలం నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలి రావాలని ఇందుకు గాను గ్రామాల వారీగా నేతలు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మహిళా, ఎస్సీ, బీసీ, మైనార్టీ, యూత్ కమిటీల బాధ్యులు మద్దికుంట రాధ, బొడ్డు కిష్టయ్య, రామాంజనేయులు, అజీం, ఉపేందర్రెడ్డి, బాలకృష్ణ, నాయకులు కొండి వెంకట్రెడ్డి, నరేందర్, షబ్బీర్, ఫిరోజ్, బాలరాజు, సంజీవరెడ్డి, కర్ణాకర్రెడ్డి, ప్రతాపరెడ్డి, సిద్దిరాంరెడ్డి, బాలరాజు, అరవింద్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు బాల్రెడ్డి, స్వామి, ఖలీల్, సునీతారాజు, కవితారాజు, రవీందర్రెడ్డి, మల్లేశం, సుశీలవినయ్ తదితరులు పాల్గొన్నారు.