నెల రోజుల్లో గంజాయి రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దాలి
విక్రయదారులపై పీడీ యాక్టు నమోదు చేయాలి
వరంగల్ సీపీ తరుణ్జోషి
హనుమకొండ సిటీ, అక్టోబర్23: యువత భవిష్యత్ను ఆగం చేస్తున్న గంజాయి విక్రయాలు, వాటి మూలాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరిమి కొట్టేందుకు డీసీపీ నుంచి హోంగార్డు వరకు నిరంతరం నిఘా పెట్టాలని సీపీ డాక్టర్ తరుణ్జోషి పోలీస్ అధికా రులకు సూచించారు. గంజాయితోపాటు మత్తు పదార్థాలను నియంత్రించడంలో భాగం గా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీపీ శనివారం నిట్లోని బోస్ ఆడిటోరియం లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భం గా తరుణ్జోషి మాట్లాడుతూ రానున్న నెల రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ను గంజాయి రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క అధికారి శ్రమించా లన్నారు. గతంలో గంజాయి, గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాల న్నారు. గంజాయి రవాణాకు పాల్పడే వారి వివరాలను తెలుసు కునేందు కు ప్రత్యేక ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవా లన్నారు. సమాచారం ఇచ్చే వక్తులకు నజరానాలను అందించి, వారి వివరాలు గోప్యంగా ఉంచాలని సూ చించారు. అదే సమ యంలో గంజాయి నియంత్రణ లో ప్రతిభ కనబరిచే సిబ్బందికి అధికారులు శాఖాపర మైన గుర్తింపు ఇవ్వాలన్నారు.
స్టేషన్ సిబ్బందితో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తూ శాశ్వత నియంత్రణ పరిష్కార మార్గాలపై దృష్టి సారిం చాలన్నారు. కళా శాలలపై నిఘా పెడుతూ అమ్మకాలు, వినియోగాలు, జరిగే అన ర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. గంజాయి విక్ర యాలు, సాగు లేని పోలీస్స్టేషన్ల అధికారులు ఆలసత్వం ప్రద ర్శించకుండా ముం చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి రవాణా కు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టు నమోదు చేయడంతోపాటు కోర్టుల్లో నేరం రుజువయ్యే విధంగా సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి లో పాన్షాపులను తనిఖీ చేస్తూ రోల్ పేపర్స్ అమ్మే వారిపై కేసులు నమోదు చేయాల న్నారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం పోలీసులు చేపడుతున్న యుద్ధంలో అన్ని వర్గాల ప్రజల మద్దతును తీసుకొని వాటిని అంతమొందించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు పుష్ప, వెంకటలక్ష్మి, శ్రీనివాస్రెడ్డి, ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఏఆర్ అదనపు డీసీ పీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.