సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు
ప్రతిపక్షాలు దళితులకు చేసిందేమీ లేదు
కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నర్సంపేట, ఆగస్టు 22: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని, సీఎం కేసీఆర్ దళిత బాంధవుడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేను దళితులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించి సన్మానించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలువాలని కోరారు. దళితుల మేలు కోసం దళితబంధు పెడితే ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుని, వారి అభివృద్ధిని మాత్రం విస్మరించాయన్నారు. దళితులందరూ ప్రభుత్వం అందించే రూ. 10 లక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళిత బంధు పథకాన్ని దేశంలోని ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదన్నారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సాధు నర్సింగరావు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దేశంలోనే గొప్పదన్నారు. దళితబంధును ప్రధాన మంత్రి దేశం మొత్తం అమలు చేయాలని కోరారు. దళితులు కేసీఆర్ మేలును ఎన్నడూ మరువరన్నారు. కార్యక్రమంలో మలమహానాడు జిల్లా ముఖ్య సలహాదారు మోటూరు రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోతి విష్ణు, జిల్లా కార్యదర్శి కున్నమల్ల కమలాకర్, జిల్లా గౌరవ సలహాదారు జమాండ్ల చంద్రమౌళి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పడిదెం రాజేందర్, డివిజన్ అధ్యక్షుడు పత్రి కుమారస్వామి, బక్కి రాజేందర్, బక్కి శివ, పీసర అనిల్కుమార్, కడగండ్ల యాకయ్య, బక్కి కుమారస్వామి, యశోద నర్సింగం, పత్రి అశోక్, ముడుసు కొమ్మాలు, కనుకుల బాబు, రాజయ్య పాల్గొన్నారు.