పల్లెప్రగతి’తో అభివృద్ధి వేగవంతం
పేదల కోసం సంక్షేమ పథకాల అమలు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
బంజారలో జీపీ భవనం ప్రారంభం
దేవరుప్పుల, అక్టోబర్ 20 : దేశంలోనే తెలంగాణ పల్లె లు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మండలంలోని బంజారలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాలోత్ కవిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి పేర గ్రామాల్లో అన్ని హంగులతో పలు అభివృద్ధి పనులు జరుగాయని, ముఖ్యంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపిగ్ యార్డ్ తదితర పథకాలు దేశంలోనే ఉత్తమ పథకాలన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కర్తవ్యమన్నారు. తాను నియోజకవర్గంలో అడుగుపెట్టిన మొదట్లో దేవరుప్పునల మండలంలో సాగు నీరు, తాగునీరు కొరత విలయతాండవం చేసేదని, గ్రామాల్లో ప్రతి వేసవిలో మహిళలు తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్లపై ప్రదర్శన చేసేవారని, ఇక వాగు వట్టిపోయి బోర్లు ఎండిపోగా వాగు పరివాహక రైతులు వలసపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. నేడు ఆ పరిస్ధితి తారుమారైందన్నారు. ఇంటింటికీ నల్లాలు, వాగు నిండా సంవత్సరాంతం నీరు ఇది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఘనతన్నారు. ఇక తండాలను పంచాయతీలు చేసి వాటిని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామాలను అభివృద్ధి చేసే శాఖలు తనకు అప్పగించడంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి చేసే అవకాశం దక్కిందన్నారు. అనంతరం సభలో రూ. 22 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధ్దిదారులకు అందజేశారు. అనంతనం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి సర్పంచ్ కవిత చూపుతున్న చొరవను మెచ్చుకున్నారు. అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీసీ పల్లా భార్గవీరెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్కుమార్, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీవో రంగాచారి, ఆర్డీవో మధుమోహన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమామహేశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి, నాయకులు మాలోత్ మధుసూదన్ నాయక్, వీరారెడ్డి దామోదర్రెడ్డి, చామల విక్రంరెడ్డి, బస్వ మల్లేశ్, చింత రవి వంగ అర్జున్, జోగేశ్, కోతి ప్రవీణ్, మల్లికార్జున్,ఇంటి మల్లారెడ్డి, రాంసింగ్, రమేశ్, గడ్డం ఎల్లయ్య, పట్టూరు గంగయ్య, ఉపసర్పంచ్ శేఖర్, రాగ్యానాయక్ పాల్గొన్నారు.