బచ్చన్నపేట, డిసెంబర్ 18 : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దని అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించా రు. మండలంలోని కేశిరెడ్డిపల్లి, కొడవటూరు గ్రామాల్లో ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రా మాల్లో సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేయాలని సూ చించారు. ధాన్యం తూకంలో కోత విధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంటాలు వేసిన ధాన్యంను వెంట నే లారీల ద్వారా మిల్లుకు తరలించాలన్నారు. వచ్చే సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కష్టతరమే అయినందున రైతులు వరికి బధులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. డీఎస్వో రోజారాణి, తహసీల్దార్ శైలజ, నయాబ్ తహసీల్దార్ సూర్య, ఆర్ఐ భగత్రెడ్డి, ఇంద్రయ్య, ఏఈవో రమేశ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
దేవరుప్పుల: మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎంపీపీ బస్వ సావిత్రి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమామహేశ్వర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని, ఆలస్యమైతే నిర్వాహకులు బాధ్యులవుతారన్నారు. మరోవైపు అన్ని గ్రామాల్లో డిసెంబర్ కల్లా వ్యాకిసనేషన్ పూర్తి చేయాలని ఆయా గ్రామాల నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు.