పాలకుర్తి సోమేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం
కార్తీక పౌర్ణమి వేడుకలకు హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ప్రత్యేక దర్శనం కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లు
పాలకుర్తి, నవంబర్ 17: మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి క్షీరగిరి క్షేత్రంలో నేడు అఖండ జ్యోతి వేడుకలు జరుగనున్నాయి. ఈ ఆలయంలోని శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం సోమేశ్వరుడు వెలిసిన గుట్టపై వెలిగించే జ్యోతిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. శబరిమల, అరుణాచలం తరువాత దక్షిణ భారత దేశంలోని మూడో అతి పెద్ద జ్యోతి ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రమైన శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అఖండజ్యోతి, లక్షదీపోత్సవం కార ్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు అసౌకర్యాలు లేకుండా ఆలయ పరిసరాల్లో సదుపాయా లు కల్పించామన్నారు. కొండ పైనుంచి దిగువకు ఇరువైపులా ఆలయ మెట్లు, ఆలయ ప్రాంగణం అంతా లక్షదీపోత్సవాలు వెలిగించేందుకు సన్నాహాలు పూర్తి చేశామన్నా రు. అఖండ జ్యోతిని ప్రారంభించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు హాజరువుతున్నట్లు ఈవో తెలిపారు.