కుడా అడ్వైజరీ కమిటీ మెంబర్ యెలుగం శ్రీనివాస్
పలు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
పోచమ్మమైదాన్/కరీమాబాద్/నర్సంపేట/రాయపర్తి, అక్టోబర్ 14 : కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు అందించిన సేవలు అభినందనీయమని కు డా అడ్వైజరీ కమిటీ మెంబర్, మాజీ కార్పొరేటర్ యెలుగం శ్రీనివాస్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా వరంగల్ 23వ డివిజన్ కొత్తవాడలో పలువురు పారిశుధ్య కార్మికులకు గురువారం దుస్తులు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికులు కరోనా వైరస్ను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని కొనియాడారు. కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు చిన్న కుమారస్వామి, నాయకులు గుడిబోయిన గోపాల్రావు, ఎం రాములు, విజయ్కుమార్, రాజేందర్, సంపత్, శోభ, మొగిలి, మురళి, ఈశ్వర్, నాగరాజు, రాజమల్లు, వెంకన్న, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లో పని చేస్తున్న సిబ్బందికి ఇన్చార్జి కమాండెంట్ ఆర్ వెంకటయ్య దుస్తులతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. బెటాలియన్ సీనియర్ అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్రెడ్డి, ఆర్ఐలు కిరణ్కుమార్, చంద్ర న్న, రాజ్కుమార్, అశోక్, ఆర్ఎస్సై నందకిశోర్, పీఆర్వో నాగేంద్రబాబు పాల్గొన్నారు. నర్సంపేట ఆర్టీసీ డిపో కార్మికులకు డీఎం శ్రీనివాసరావు తన సొంత ఖ ర్చులతో టిఫిన్ బాక్స్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, ఎస్టీఐ కృష్ణకుమారి, ఎంఎఫ్ అమల, శాంతమ్మ, ఏడీసీలు సాంబయ్య, నారాయణ, ఆయిల్ డీసీ సమ్మయ్య, రవికుమార్ పాల్గొన్నారు. అలాగే, సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నర్సంపేటలోని తొమ్మిదో వార్డు ప్రజలకు కౌన్సిలర్ కీర్తిదుశ్యంత్రెడ్డి ఇంటింటికీ వెళ్లి స్వీట్ బాక్స్లు పంపిణీ చేశారు. పట్టణ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రాయిడి దుశ్యంత్రెడ్డి, వార్డు కమిటీ సభ్యులు, పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ లేతాకుల సుమతి నేతృత్వంలో దుస్తు లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ బాద సారయ్య, కార్యదర్శి బెజ్జంకి సుమలత, కారోబార్ గూడెల్లి ఉప్పలయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.