పేదల కోసమే అనేక పథకాలు అమలు
తండాలను జీపీలు చేసిన కేసీఆర్
ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్
కొనసాగుతున్న ‘మన ఊరు..మన ఎమ్మెల్యే’ ప్రోగ్రాం
కేసముద్రం, డిసెంబర్ 4: పేద ప్రజల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ‘మన ఊరు.. మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్నారం, ధర్మారంతండా, గాంధీపురంలలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ నాయకులు కృషిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. కల్యాణలక్ష్మీ ద్వారా రూ.1,00,116, బాలింతలకు కేసీఆర్ కిట్తోపాటు రూ.12వేల ఆర్థికసాయం, ఆసరా పెన్షన్లు వంటి పథకాలు పేదలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని వివరించారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఇస్తున్న రూ.5లక్షల ఆర్థికసాయం కొండంత అండగా ఉంటోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం గురుకులాలు నెలకొల్పడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడంలో విఫలం చెందాయన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పోడు రైతులకు 2007 చట్టం ప్రకారం పట్టాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ్రావు, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దామరకొండ ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఊకంటి యాకుబ్రెడ్డి, జాటోత్ హరీశ్నాయక్, కముటం శ్రీనివాస్, బొబ్బిలి మహేందర్రెడ్డి, మోడెం రవీందర్గౌడ్, చిర్ర యాకాంతంగౌడ్, గుగులోత్ వీరూనాయక్, ఘనపురపు రమేష్, సర్పంచ్ కదిర స్రవంతి, తహసీల్దార్ గోలి కోమల, ఎంపీడీవో రోజారాణి, ట్రాన్స్కో ఏఈ శశిధర్, ఈవోపీఆర్డీ రఘుపతిరెడ్డి ఉన్నారు.