వంద శాతం లక్ష్యం దిశగా అడుగులు
93శాతం మొదటి డోస్,52.3శాతం రెండో డోస్ పూర్తి
ఒమిక్రాన్ నేపథ్యంలోయంత్రాంగం అప్రమత్తం
నిబంధనలు మరింత కఠినతరం
భౌతిక దూరం తప్పనిసరి
మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు సిద్ధం
మహబూబాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. వైద్యసిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 7,91,173 మంది జనాభా ఉండగా, 5,63,478 మంది వ్యాక్సిన్కు అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు 5,23,931(93శాతం)మందికి మొదటి డోస్, 2,73,892 (52.3) మందికి రెండో డోస్ టీకాలు ఇచ్చారు. జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉండ గా 1,002 గ్రామాల్లో, తొర్రూరు, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లోని 297 కాలనీల్లో వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేశారు. డోర్నకల్ పీహెచ్సీలో 36,073 మందికి మొదటి డోస్, 16,616 మందికి సెకండ్ డోస్, బలపాల పీహెచ్సీలో 16,588 మందికి మొదటి, 6919 సెకండ్, కురవిలో 31,411 మందికి మొదటి, 11,868 మందికి సెకండ్, గంధంపల్లిలో 14,434 మందికి మొదటి, 6,055 మందికి సెకండ్, బయ్యారంలో 16,851 మందికి మొదటి, 6,901 మందికి సెకండ్, ముల్కనూరు 25,653 మందికి మొదటి, 15,240 మందికి సెకండ్, మహబూబాబాద్లో 37,660 మందికి మొదటి, 21,409 మందికి సెకండ్, కేసముద్రంలో 31,157 మందికి మొదటి, 13,631 మందికి సెకండ్, ఇనుగుర్తి 18,942 మందికి మొదటి, 11,532 మందికి సెకండ్, గూడూరులో 29,510 మందికి మొదటి, 13,871 మందికి సెకండ్, తీగలవేణిలో 10,916 మందికి మొదటి, 5,891మందికి సెకండ్, కొత్తగూడలో 15,185 మందికి మొదటి, 7,419 మందికి సెకండ్, గంగారంలో 7,680 మందికి మొదటి, 4,255 మందికి సెకండ్, తొర్రూరులో 68,292 మందికి మొదటి, 43,318 మందికి సెకండ్, నెల్లికుదురులో 42,997 మందికి మొదటి, 22,614 మందికి సెకండ్,దంతాలపల్లిలో 43,380 మందికి మొదటి, 18,806 మందికి సెకండ్, మరిపెడలో 51,895 మందికి మొదటి, 19015 మందికి సెకండ్, ఉగంపల్లిలో 10,567 మందికి మొదటి, 4,940 మందికి సెడండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.
ఒమిక్రాన్పై అప్రమత్తం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియతోపాటు కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత ముమ్మరం చేశారు. కరోనా వార్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మహబూబాబాద్, గార్ల, తొర్రూరు, మరిపెడ, గూడూరు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా కరోనా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. శానిటైజర్ వాడడంతోపాటు భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. త్వరలో నూరుశాతం పూర్తి చేస్తాం. 5,23,931 మందికి మొదటి, 2,73,892 మందికి సెకండ్ డోస్ ఇచ్చాం. 1,002 గ్రామాలు, 297 కాలనీల్లో నూరుశాతం పూర్తి చేశాం. 243 ప్రత్యేక వైద్యబృందాలు సబ్ సెంటర్లు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక క్యాంపు పెట్టి టీకాలు అందిస్తున్నారు. ఈ నెల చివరి వరకు నూరుశాతం పూర్తి చేస్తాం.