రాయపర్తి, అక్టోబర్ 3 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎ కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శా ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభు త్వం ఉచితంగా సరఫరా చేసిన బతుకమ్మ చీరెలను మంత్రి కలెక్టర్ బీ గోపితో కలిసి లబ్ధిదారులకు పం పిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలు నిరాదరణకు గురయ్యాయని చె ప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని కు లాలు, జాతులను ప్రభుత్వం సమాన దృష్టితో చూ స్తూ పండుగలను సైతం అధికారికంగా నిర్వహిస్తోందని వివరించారు. ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి చీరెలు అందిస్తున్నదన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం పెద్ద పీట వేశారని గుర్తు చేశా రు. రాష్ట్రంలో మనుగడ కోల్పోయే దశలో ఉన్న ప్ర తిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించొద్దని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బా నోత్ హరిసింగ్, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కు మారస్వామి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయ ణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, అధికారులు శేషం కిరణ్కుమా ర్, అనూష, పెద్దూరి శ్రీకాంత్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, మం డలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, పూస మధు, గారె నర్సయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు కర్ర సరిత, లేతాకుల సుమతి, బోనగిరి ఎల్లయ్య, గాజులపాటి నర్మద, కాంచనపల్లి వనజారాణి, చి న్నాల తారాశ్రీ, జీ అనంతప్రసాద్ పాల్గొన్నారు.