ములుగు, జనవరి 22(నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు స్వచ్ఛ గ్రహీస్ విభాగంలో ములుగు మండలం జంగాలపల్లి సర్పంచ్ మస్రగాని అనిత-వినయ్కుమార్ దంపతులకు ఆహ్వానం అందింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ ఎం హన్మంతరావు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 24న ఢిల్లీకి, 29న హైదరాబాద్కు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.