ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా మొక్కలు నాటాలి
అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్
చిల్పూరు, జూలై 12 : హరితహారంలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ కోరారు. మంగళవారం మండలంలోని వంగాలపల్లి, చిన్నపెండ్యాల గ్రామాలను ఆయన సందర్శించారు. రహదారులకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను పరిశీలించి సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా ఊరూరా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని అబ్దుల్హమీద్ కోరారు. పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన కోరారు. అనంతరం వంగాలపల్లిలో జాతీయ రహదారిపై నుంచి డ్రైనేజీ నీరు పొలాల్లోకి వస్తున్న విషయమై రైతులు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ దృష్టికి తేగా స్పందించిన ఆయన తహసీల్దార్తో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అరూరి ప్రణిత, మామిడాల లింగారెడ్డి, తహసీల్దార్ విమల, ఆర్ఐ శ్రీనివాస్, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, ఎంపీవో మాధుసూదనాచారి, ఈసీ కిరణ్కుమార్, టీఏ చేరాలు తదితరుల పాల్గొన్నారు.
వంగాలపల్లిలో హరితహారం పనులు పరిశీలిస్తున్న అబ్దుల్హమీద్