ప్రైవేట్ వాహనాలు సామర్థ్యానికి మించి
ప్రయాణికులను తీసుకెళ్తే సీజ్ చేయాలి
వారానికి ఒకరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
సంస్థ ఆదాయ మార్గాలపై అధికారులతో సమీక్ష
జనగామ చౌరస్తా, జూలై 14 : జిల్లాలో ఆర్టీసీ ఆదా యాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్టీసీ ఆదాయ మార్గాలపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఆర్టీసీ రవా ణా సంస్థ ప్రజల భద్రత, రవాణా కో సం ఏర్పాటు చేసిన వ్యవస్థ అని తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా ఎదుగుదలకు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని సూచించారు. ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేట్ వాహనాలు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. ఆ వాహన డ్రైవర్ లైసెన్స్ కూడా రద్దు చేయాలన్నారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ రహదారులపై ఓవర్ స్పీడ్గా వెళ్లే వాహనాలపై పోలీసు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వారానికి ఒక్కరోజు సంబంధిత శాఖల అధికారులు ఆర్టీసీపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. ఆటోలను బస్టాండ్ ఆవరణలోకి రాకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం వృద్ధులు, ది వ్యాంగులు మాత్రమే ఆటోల్లో బస్టాండ్ ఆవరణలోకి వచ్చేందుకు అనుమతించాలని కలెక్టర్ శివలింగయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో వెస్ట్జోన్ డీసీపీ సీతారాం, ఆర్టీసీ ఆర్ఎం వీ శ్రీదేవి, జిల్లా రవాణా శాఖ అధికారి సింగం శ్రీనివాస్ రావు, డిప్యూటీ ఆర్ఎం బీ కృపాకర్రెడ్డి, డీఎం జ్యోత్స్న పాల్గొన్నారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 201 మందికి అనుమతి
టీఎస్ ఐపాస్ కింద జనగామ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 201 మందికి అనుమతిచ్చినట్లు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కమిటీ’తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద జిల్లాలో 236 దరఖాస్తులు జిల్లా పరిశ్రమల శాఖకు వద్దకు రాగా, అందులో 226 పరిశీలించి, 201 దరఖాస్తులకు అనుమతిచ్చినట్లు తెలిపారు. టీ ఫ్రైడ్ పథకం కింద 18 మంది ఎస్సీలు, 116 మంది ఎస్టీలకు సబ్సిడీ కోసం సిఫార్సు చేసినట్లు తెలిపా రు. పరిశ్రమలను స్థాపించడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కమర్షియల్ టాక్స్, టీఎస్ఐఐసీ, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్, టీఎస్ ఎన్పీడీసీఎల్, ఫ్యాక్టరీస్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఫైర్, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖలు స్వీకరించిన దరఖాస్తులను జాప్యం చేయకుండా నిర్ణీత గడువులోగా, అనుమతి మంజూరు చే యాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరగా అనుమతులిస్తే ఔత్సాహికులు మరింత మంది మైక్రో లెవెల్ పరిశ్రమ లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉం టుందన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ అధికారులు పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సహకారం అందజేయాలన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమేశ్, ఎస్ఈ ఎలక్ట్రిసిటీ మల్లికార్జున్రావు, జిల్లారవాణా అధికారి శ్రీనివాస్రావు, ఎల్డీఎం శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జీ వెంకన్న పాల్గొన్నారు.