‘షర్మిలను నడిపిస్తున్నది బీజేపీయే. పత్రికలు, టీవీల్లో కవరేజీ కోసమే కొత్త నాటకాలు మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేసుకోవాలె.. కానీ గొడవలు సృష్టించొద్దు. ప్రజలు అంతా గమనిస్తున్నారు.’ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నెక్కొండ సర్వసభ్య సమావేశానికి హాజరైన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 23 కొత్త బీటీ రోడ్ల నిర్మాణానికి రూ. 22.30కోట్లు మంజూరైనట్లు చెప్పారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
నెక్కొండ, డిసెంబర్ 12: సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాదయాత్రల వెనుక ఉ న్నది ఎవరో తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. పా దయాత్ర చేసే పరిస్థితి లేక కేవలం పత్రికల్లో, టీవీల్లో కవరేజీ కోసమే కొత్త నాటకాలకు ఆమె తెరలేపార న్నారు. పాదయాత్ర ఎవరైనా చేసుకోవచ్చని, ప్రజాస్వా మ్య పద్ధతిలో ఎవరైనా విమర్శలు చేసుకోవచ్చన్నారు. హైకో ర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామన్నారు. కేసీఆ ర్ను టార్గెట్చేసి బీజేపీ ఒక్కో క్యారెక్టర్ను రంగ ప్రవేశం చేయించి, వ్యక్తిగత విమర్శలు చేయిస్తోంద న్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజక వర్గంలోని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ రోడ్లపైకి వస్తు న్నారని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉన్న కరోనా సమ యంలో వారి జాడ ఎక్కడాలేదన్నారు. గతంలో నెక్కొం డ మండ లంలో దోపిడీ బాగా జరిగిందన్నారు. అందుకే నెక్కొండ మండలానికి అత్యధిక నిధుల కేటాయింపు జరుగుతోందన్నారు. మండలంలోని 31 తండాల్లో 23 కొత్త బీటీ రోడ్లను రూ. 22.30 కోట్ల లో నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయన్నారు. 54 కి.మీ మేర చేపడుతున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను రాబోయే నాలు గు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధ్దమైందన్నారు.
రాష్ట్రం ఏర్పాటయ్యాక గిరిజన తండాల ను ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసిందన్నా రు. పంచాయతీల్లోని అన్ని తండాలను, గ్రామాలను, మండల, జిల్లా కేంద్రాలకు కలుపుతూ బీటీ రోడ్లను మంజూరు చేయ డం జరుగుతోందన్నారు. కొత్తగా మంజూరయైన బీటీ రోడ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. మండలంలోని అన్ని గిరిజన తండాలకు బీటీరోడ్లు మంజూరవడంతో గిరిజనులు పెద్దసంఖ్యలో మండల కేంద్రానికి చేరుకొని పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. షర్మిలను నడిపించేంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. షర్మిల పాదయాత్రల వెనుక ఉన్నది ఎవరో తెలంగాణ ప్రజలకు అర్ధమైందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజ హరికిషన్, సొసైటీ చైర్మన్ మారం రాము, జలగం సంపత్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, మండల నాయకులు గుంటుక సోమయ్య, గదె భద్రయ్య, సొసైటీ మాజీ చైర్మన్ కే రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
మండల అభివృద్ధే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జాటోత్ రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామా ల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అం దరూ వ్యవహరించాలని, గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందడమే అందరి లక్ష్యమవ్వాలన్నారు.
మండలంలోని అన్ని గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్లు , అలాగే తండాల్లో సీసీ రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నా రు. మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడీటీసీ లావుడ్య సరోజ హరికిషన్, తహసీల్దార్ డీఎస్ వెంకన్న, సొసైటీ ఛైర్మన్ మారం రాము, సంపత్రావు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.