స్టేషన్ఘన్పూర్, జనవరి 2: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని రిజర్వాయర్ తూములు, పంట పొలాలకు నీరందించే కాల్వలకు మరమ్మతు చేసి యాసంగికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రైతులు, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి రిజర్వాయర్ కట్టను, తూములను పరిశీలించారు. తూముల వద్దకు కాలినడకన, ఆటోలో వెళ్లారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. ఎత్తిపోతల పథకం ద్వారా 48వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో స్టేషన్ఘన్పూర్ పెద్ద చెరువును, రాజవరం చెరువును కలిపి రిజర్వాయర్గా మార్చినా కార్యరూపం దాల్చలేదన్నారు. రిజర్వాయర్ కింద ఉన్న నాలుగు పాత తూములు పూడుకుపోయాయని, పంట కాల్వల్లో మట్టి, తుంగ పెరిగిందన్నారు.
కాల్వలు అక్కడక్కడ కొంత దెబ్బతిన్నాయన్నారు. పంట కాల్వల ద్వారా గ్రామంలోని మురుగు నీరు పొలాల్లోకి చేరడంతో సాగు చేయలేకపోతున్నందున సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారని ఆయన వివరించారు. ముందుగా రైతులకు సాగునీరు అందించేందుకు తాత్కాలికంగా వారం రోజుల్లో పంట కాల్వల్లో మట్టిని, తుంగను తొలగించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. కాల్వల ద్వారా సుమారు 4800 ఎకరాలకు సాగునీరు అందుతున్నదని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన సమగ్ర సర్వే ఎస్టిమేట్లు చేసి ఇవ్వాలని అధికారులను కోరినట్లు కడియం తెలిపారు. కట్టపై చెట్లను తొలగించి సుందరీకరణ పనులను త్వరలోనే చేపడతామని వివరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు నరేందర్రెడ్డి, వెంకన్న, శంకర్, మధుసూదన్రెడ్డి, ఎంపీటీసీలు రాజు, నర్సింహులు, యాదవ్, రాజు, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 18మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కడియం పంపిణీ చేశారు. చెక్కులను ఈ నెల 6లోగా బ్యాంకులో జమ చేసుకోవాలని కోరారు. ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రవీందర్, జడ్పీటీసీ రవి, ఎంపీపీ కందుల రేఖ, సర్పంచ్లు సురేశ్, సారంగపాణి, నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, సర్పంచ్ల ఫోరం చిల్పూరు మండల అధ్యక్షుడు లింగారెడ్డి పాల్గొన్నారు.